పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఆ మాట అంటే చాలు నా జన్మ ధన్యమైపోయినట్టే: పృథ్వీరాజ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయినటువంటి వారిలో పృథ్వీరాజ్( prudhvi Raj) ఒకరు.

ఈయన ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా చాలా ఆసక్తి కనబరిచారు.

అయితే గత ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీ( YSRCP Party )కి మద్దతు తెలుపుతూ పార్టీ విజయానికి దోహదపడిన పృథ్వీ రాజ్ కి వైసిపి ప్రభుత్వం ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్( SVBC Channel Chairmen) గా పదవి అప్పజెప్పారు.అయితే ఈయన ఫోన్ కాల్ లీక్ అవడంతో ఈ పార్టీ నుంచి తనని సస్పెండ్ చేశారు అనంతరం జనసేన పార్టీకి మద్దతు ప్రకటించారు.

ఇలా జనసేన పార్టీ( Janasena Party ) లోకి వచ్చినటువంటి పృథ్వీరాజ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన పలు విషయాల గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ .మెగా కుటుంబంతో తనకు విభేదాలు ఉన్నాయనే వార్తలలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు.అలాగే గత కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా రజనీకాంత్ ( Rajinikanth ) పట్ల వైసిపి నేతలు విమర్శించిన తీరును ఈయన తప్పుపట్టారు.

రజనీకాంత్ గారిని విమర్శించేవారు ఆయన ఇంట్లో కుక్క కాలిగోటికి కూడా సరిపోరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఇక జనసేన పార్టీ తరపున మీరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అంటూ ప్రశ్నించడంతో తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి లేనని జనసేన పార్టీ కోసం శ్రమిస్తున్నటువంటి కార్యకర్తలకు నేతలకు తన వంతు సహాయం చేస్తూ వారి గెలుపుకు మద్దతు ప్రకటిస్తానని ఈ సందర్భంగా పృథ్విరాజ్ తెలిపారు.ఇక పవన్ కళ్యాణ్ గెలుపొంది అసెంబ్లీలో అధ్యక్ష అనేమాట వినాలని ఉందని, ఆ మాటతో నా జన్మ ధన్యమైపోతుంది అంటూ ఈ సందర్భంగా పృథ్వీరాజ్ జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు