ఏలూరు జిల్లా: సబ్ కలెక్టర్ ఆఫీస్ నుండి చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వరకు మామిడికాయలు ఉచితంగా పంచుతూ రైతు నిరసన.ఆగిరిపల్లి మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన రైతు దళారీల వలన నష్టపోతున్నామంటూ మామిడికాయలు నూజివీడు తీసుకొచ్చి ఉచితంగా పంపిణీ.
అకాల వర్షాలకు మామిడి తోటలోని మామిడికాయలు మంగు,మసితో పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు.మార్కెట్కు తీసుకు వెళ్తే కొనే నాధుడు లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అందుకే ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాము అంటున్న రైతు రాజగోపాల్.