మినుము( Vigna mungo, ) పంటను వర్షాధారంగా, రబీ సీజన్లో సాగు చేస్తారు.మినుము పంటకు అన్ని రకాల నల్లరేగడి భూములు అనుకూలంగా ఉంటాయి.
వరి మాగాణి లో అయితే డిసెంబర్ నెలలో విత్తుకోవాలి.వర్షాధార పంట గా అయితే జూన్ లేదా జులై నెలలో విత్తుకోవాలి.
మినుము పంటకు నీటి అవసరం చాలా తక్కువ కాబట్టి వర్షపు నీటితోనే మినుమును పండించవచ్చు.
మినుము పంట వేసే పొలంలో ముందుగా వేసవి లో లోతు దుక్కులు దున్నాలి.
తొలకరి వర్షాలు పడగానే గొర్రుతో భూమిని మెత్తగా చేసుకోవాలి.తేమ నిల్వ ఉండే భూములలో అధిక దిగుబడి సాధించవచ్చు.
ఈ పంటకు పెట్టుబడి చాలా తక్కువ అవసరం.

వర్షాధారంగా పండిస్తే ఎకరాకు 6 కిలోల విత్తనాలు అవసరం.అదే వరి మాగాణి లో అయితే 10 కిలోల విత్తనాలు అవసరం.విత్తనాలను పొలంలో నాటే ముందు కచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి.
లేదంటే చీడపీడల బెడద అధికంగా వ్యాపించి తీవ్ర నష్టం వస్తుంది.

మినుము పంటకు పల్లాకు తెగుల బెడద చాలా ఎక్కువ.సకాలంలో ఈ తెగులను గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే పంట మొత్తం నాశనం అయ్యి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.కాబట్టి పల్లాకు తెగులను ఎలా గుర్తించాలో.
ఎలా నివారించాలో తెలుసుకుందాం.
ఈ పల్లాకు తెగులు జెమిని వైరస్ జాతి వల్ల వ్యాప్తి చెందుతాయి.
లేత ఆకులపై, కాయలపై పసుపు పచ్చ మచ్చలు ఏర్పడితే వాటిని పల్లాకు తెగులుగా నిర్ధారించుకోవాలి.తొలి దశలో ఈ తెగులు సోకిన వెంటనే పైరు గిడస బారిపోయి, పూత ఎండిపోతుంది.
అంతేకాకుండా ఈ వైరస్( Virus ) సోకిన ప్రాంతంలో తెల్ల దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి ఈ తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి నాశనం చేయాలి.ఒక లీటర్ నీటిలో 1.6మి.లీ మోనోక్రోటోఫాస్ ను కలిపి మొక్క మొత్తం తడిచేలాగా పిచికారి చేయాలి.







