ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ అందించింది.ఎంప్లాయిస్ కు హెచ్ఆర్ఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్ లో పని చేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది.కాగా ఈ హెచ్ఆర్ఏ 12 శాతం నుంచి 16 శాతానికి పెరిగిందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తితో పాటు రాయచోటి జిల్లా కేంద్రాల ఉద్యోగులకు పెంపు వర్తించనుంది.







