గర్భవతులకు వరంగా మారిన ప్రభుత్వ స్కీమ్.. చేరితే ఖాతాలోకి నేరుగా రూ.5,000

మాతృత్వం దేవుడు ప్రసాదించే ఒక అద్భుతమైన వరం అని చెప్పవచ్చు.అయితే గర్భవతి( Pregnancy ) అయినప్పుడు వైద్య ఖర్చులు పెను భారంగా మారుతాయి.

 Pradhan Mantri Matru Vandana Yojana Scheme For Pregnancy Women , Pradhan Mantr-TeluguStop.com

ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు గర్భం ధరించిన సమయంలో ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది.దీనిని గమనించిన ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చింది.

అదే ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన (PMMVY)( Pradhan Mantri Matru Vandana Yojana ) పథకం.ఇది భారతదేశంలోని గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు వరంగా మారింది.

గర్భధారణ సమయంలో వీరి ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఈ కార్యక్రమం గర్భధారణ, ప్రసవానంతర సమయంలో వైద్య చికిత్స, ఔషధ ఖర్చులకు సంబంధించిన ఆర్థిక భారాన్ని( Financial assistance ) తగ్గించుకోవడానికి అర్హత కలిగిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

ఈ పథకానికి అర్హత పొందాలంటే, గర్భవతులు, పాలిచ్చే తల్లులు తప్పనిసరిగా భారతీయ పౌరులు అయి ఉండాలి.వారికి ఒక బ్యాంకు ఖాతా ఉండాలి.ఈ పథకం రోజువారీ కూలీలు లేదా ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్న మహిళలకి లబ్ధి చేకూరుస్తుంది.అయితే, ఈ పథకం ఏదైనా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసే మహిళలకు వర్తించదు.

అలానే, మొదటి బిడ్డకు జన్మనిచ్చే లేదా అప్పుడే మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనాలు లభిస్తాయి.

గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో ఈ ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకున్న మహిళలు రూ.1,000 నగదును అందుకుంటారు.గర్భం దాల్చిన ఆరవ నెలలో కనీసం ఒక యాంటెనాటల్ చెకప్ తర్వాత అదనంగా రూ.2,000 పొందుతారు.బిడ్డ పుట్టినప్పుడు నమోదు చేసిన తర్వాత మూడవ, చివరి వాయిదాగా రూ.2,000 అందుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube