స్టార్ డైరెక్టర్ మణిరత్నం( Star Director Maniratnam )దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా ఏడాది విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.పాన్ ఇండియా లెవెల్ విడుదల అయినప్పటికీ అన్ని భాషల్లో మిక్స్ డ్ టాక్ ని సొంతం చేసుకోగా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.
ఈ సినిమా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా అనగా ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన పొన్నియిన్ సెల్వన్ 2( Ponniyin Selvan 2 ) సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఈ సారి కూడా మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకుంది.తమిళ ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నారు.కాగా ఈ ఈ సినిమాలో విక్రమ్( Vikram ), జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్ సెలెబ్రిటీలు నటించిన విషయం తెలిసిందే.తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని దూసుకుపోతోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ పార్ట్నర్( Digital partner )ను చిత్ర యూనిట్ లాక్ చేసింది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమాను ఓటీటీ( Ponniyin Selvan 2 OTT )లో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఈ చిత్రానికి ఏఆర్.రెహమాన్( AR Rahman ) సంగీతం అందించిన విషయం తెలిసిందే.ప్రస్తుతానికి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా పోను పోను కలెక్షన్లను ఏ విధంగా రాబడుతుందో చూడాలి మరి.







