టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ ( Actor Shivaji )రాజకీయాల్లో లేకపోయినా రాజకీయాలకు సంబంధించి స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.గత ఎన్నికలకు ముందు శివాజీ ఆపరేషన్ గరుడ అని కామెంట్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
జగన్( JAGAN ) సీఎం అయితే ఏం జరుగుతుందని చెప్పానో అదే జరుగుతోందని ఆయన తెలిపారు.నీ పని నువ్వు చేసుకో అని నాకు వార్నింగ్ ఇచ్చారని ఆయన తెలిపారు.
నేను సమాజాన్ని వదిలిపెట్టి పోనని మంచు ముసుగులో చెడు చేయాలని అనుకోనని శివాజీ కామెంట్లు చేశారు.ఉండవల్లి ( Undavalli )గారి పేరు పలకనని ఆయన తెలిపారు.
ఉండవల్లి చెప్పేది అబద్ధం అని ఆయన ఎవరికోసం పని చేస్తున్నారో అందరికీ తెలుసని శివాజీ కామెంట్లు చేశారు.రామోజీరావు గారు తప్పు చేసి ఉంటే సరిదిద్దుకునేవారని ఆయన పేర్కొన్నారు.32 కేసులు ఉన్న జగన్ సీఎంగా ఉండవచ్చా? అని ఏనాడైనా ప్రశ్నించావా? అని ఉండవల్లి చెప్పుకొచ్చారు.

రామోజీ రావు( Ramoji Rao ) మీద కేసు లేదని ఉండవల్లి పెట్టాడని ఆ విధంగా అయన అర్హుడా అని ఉండవల్లి ప్రశ్నించారు.నిజంగా తప్పు చేస్తే కోర్టులు డిసైడ్ చేస్తాయని ఆయన తెలిపారు.సింహాన్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నావని రామోజీ రావు గారు విలువలతో బ్రతుకుతున్నారని ఆయన కామెంట్లు చేశారు.
జగన్ అత్యంత కాస్ట్లీ ముఖ్యమంత్రి అని శివాజీ పేర్కొన్నారు.

ఏపీలో 2024లో టీడీపీదే( TDP ) విజయమని ఆయన తెలిపారు.జగన్ గారు చేస్తున్న తప్పులే ఆయనకు మైనస్ అవుతున్నాయని శివాజీ చెప్పుకొచ్చారు.శివాజీ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శివాజీ కామెంట్ల గురించి వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.శివాజీ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున అయినా పోటీ చేస్తారేమో చూడాల్సి ఉంది.







