దిగ్గజ కంపెనీ మ్యాన్కైండ్ ఫార్మా ఐపీఎల్ ప్రారంభమైంది.కంపెనీ IPOలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం 13 షేర్లను కొనుగోలు చేయాలి.ఒక లాట్ ధర రూ.14,040.43000 కోట్ల విలువైన ఈ కంపెనీ నిర్మాణం వెనుక ప్రత్యేక కృషి ఉంది.ఈ ఇద్దరు సోదరుల పేర్లు రమేష్ జునేజా, రాజీవ్ జునేజా(Ramesh Juneja, Rajeev Juneja).వీరు కష్టపడి, అంకితభావంతో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారు.1974వ సంవత్సరంలో రమేష్ జునేజా నీ ఫార్మా కంపెనీలో MR గా తన వృత్తిని ప్రారంభించాడు.తన కంపెనీకి చెందిన మందులను విక్రయించేందుకు వైద్యులను కలవాల్సి వచ్చింది.అయితే చాలా సార్లు వైద్యులను కలవాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.ఆ రోజుల్లో రమేష్ యూపీ రోడ్వేస్ బస్సుల్లో ప్రయాణించి తన పనులను పూర్తి చేసేవారు.మెల్లమెల్లగా కెరీర్ సాగుతుండటంతో ఈ ఉద్యోగానికి రాజీనామా చేశారు.1975లో రమేష్.లుపిన్ ఫార్మాలో(Lupine Pharma) ఉద్యోగంలో చేరారు.

ఈ కంపెనీలో 8 సంవత్సరాలు పనిచేశారు.1983లో ఈ సంస్థకు కూడా గుడ్ బై చెప్పారు.రమేష్ భాగస్వామితో కలిసి కంపెనీ ఏర్పాటు చేశాడు.దానికి బెస్టోకెమ్ అని పేరు పెట్టారు.అయితే ఈ కంపెనీ కూడా ఎక్కువ కాలం నడపలేకపోయారు.1994లో రమేష్ జునేజా( Ramesh Juneja ) బెస్టోకేమ్ను విడిచిపెట్టారు.రమేష్ జునేజా బెస్టోకెమ్ కంపెనీని విడిచిపెట్టిన తర్వాత అతను కొత్త కంపెనీలో చేరారు.1995లో రమేష్ జునేజా తన తమ్ముడు రాజీవ్ జునేజాతో కలిసి కొత్త కంపెనీని స్థాపించారు.50 లక్షల పెట్టుబడితో ఏర్పడిన ఈ కంపెనీనే మ్యాన్కైండ్ ఫార్మా.

ఈ కంపెనీ 25 మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ (MR)తో ప్రారంభమయ్యింది.తొలి ఏడాదిలోనే మ్యాన్కైండ్ ఫార్మా రూ.4 కోట్ల కంపెనీగా అవతరించింది.జునేజా సోదరులు కంపెనీ విస్తరణ కోసం అడ్వర్టైజ్మెంట్ సహాయం తీసుకోవాలని ప్లాన్ చేశారు.సోదరులిద్దరూ టీవీలో మ్యాన్కైండ్ కండోమ్లు, గర్భనిరోధక ఉత్పత్తులకు(Mankind condoms, for contraceptive products) ప్రచారం కల్పించారు.ఇంతకు ముందెన్నడూ చూడని ఇలాంటి కండోమ్ ప్రకటనను 2007లో ఈ కంపెనీ టీవీలో చూపించింది.2012, 2013 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 20 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.ఇతర కంపెనీలు పెట్టుబడి పెట్టని రంగాలపై కంపెనీ దృష్టి సారించింది.దీంతో కంపెనీకి ప్రయోజనం కూడా దక్కింది.కంపెనీ మధుమేహం, రక్తపోటు మందులను తయారు చేయడం ప్రారంభించింది.నేడు మ్యాన్కైండ్ ఫార్మా 43264 కోట్ల విలువైన కంపెనీగా మారింది.







