అల్లరి సినిమాతో హీరోగా పరిచయమైన నరేష్ ఆ తర్వాత అల్లరి నరేష్( Allari naresh ) గా మారి పోయాడు.మొదటి సినిమాతో నవ్వించిన నరేష్ ఆ తర్వాత అల్లరి నరేష్ గా నవ్విస్తూనే ఉన్నాడు.
దాదాపు దశాబ్ద కాలం పాటు మినిమం గ్యారంటీ హీరోగా నిలిచిన అల్లరి నరేష్ మధ్యలో కాస్త ఒడిదుడుకులని ఎదుర్కొన్నాడు.చేసిన ప్రతి కామెడీ పాత్ర రొటీన్ గా ఉంది అంటూ విమర్శలు ఎదుర్కోవడంతో పాటు ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వచ్చింది.
దాంతో అల్లరి నరేష్ ఆలోచన తీరు మారింది.

కామెడీ మాత్రమే ఎందుకు ట్రై చేయాలి సీరియస్ ఎందుకు ట్రై చేయకూడదు అంటూ కొన్ని సినిమాలు చేశాడు.అందులో నాంది సినిమా( Naandhi ) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ప్రస్తుతం అదే సినిమా దర్శకుడితో చేసిన ఉగ్రం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు.
భారీ అంచనాలను పొందిన ఉగ్రం సినిమా ను భారీ ఎత్తున తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా మల్టీస్టారర్ సినిమాల పట్ల తాను చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా పేర్కొన్నాడు.మరో హీరోతో కలిసి నటించడం వల్ల ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించే అవకాశం ఉంటుంది అని అల్లరి నరేష్ భావిస్తున్నాడు.
మహేష్ బాబు ( Mahesh Babu )తో కలిసి నటించినట్లుగా సీనియర్ స్టార్ హీరోలతో మరియు ప్రస్తుత యంగ్ స్టార్ హీరోలతో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ అల్లరి నరేష్ ప్రకటించాడు.

కథ పాత్ర విషయం లో కాస్త జాగ్రత్తగా ఉంటే తప్పకుండా తాను నటించేందుకు సిద్ధం అన్నట్లుగా తాజా ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ చేసిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.అందరు హీరోలు కూడా ఇలా ఆలోచిస్తే బాగుంటుంది కదా.ఎందుకు అందరూ హీరోలు అల్లరి నరేష్ మాదిరిగా ఆలోచించడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఉగ్రం సినిమా సక్సెస్ అయితే అల్లరి నరేష్ మరిన్ని సీరియస్ పాత్రల్లో నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆయన సన్నిహితులు అభిప్రాయం చేస్తున్నారు.







