కోలీవుడ్ హీరోల్లో అద్బుతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య.ప్రస్తుతం సూర్య తన కెరీర్ లో 42వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.‘‘కంగువ” ( Suriya ) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.సూర్య సినిమాల కోసం తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూనే ఉంటారు.

ఈ మధ్య కాలంలో సూర్య నటిస్తున్న అన్ని సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలు సాధిస్తున్నాయి.అందుకే ఇప్పుడు చేస్తున్న కంగువ సినిమా మీద మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.డైరెక్టర్ శివ ( Siruthai Siva ) దర్శకత్వంలో గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇక ఈ సినిమా నుండి తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.కోలీవుడ్ మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ( Kanguva First Single ) మే రెండవ వారంలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఆల్ ఓవర్ ఇండియా ఎదురు చూస్తుంది.

యూవీ క్రియేషన్స్ అండ్ గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 10 భాషల్లో రిలీజ్ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇదిలా ఉండగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ ( Disha Patani ) హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.మరి సూర్య ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాల్సిందే.







