టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి సిదిరి అప్పలరాజు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు.టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు.
ఈ క్రమంలో తాము ఏం అభివృద్ధి చేశామో చూపిస్తామన్న మంత్రి సిదిరి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.ఈ మేరకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 200 పడకల ఆస్పత్రి వద్ద మంత్రి సిదిరి అప్పలరాజు సెల్ఫీ తీసుకున్నారు.
తరువాత కాశీబుగ్గ – వజ్రపుకొత్తూరు నిర్మాణంలో ఉన్న రోడ్డుపైనా సెల్ఫీ దిగారు.







