రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి.
అంగన్వాడీ విద్యార్థులు ఇంగ్లీష్ పాటలు, తెలుగు పాటలు ,బాల గేయాలు కథ,లు సృజనాత్మకత రంగాలలో అన్నింట విశేషమైన ప్రతిభను కనపరిచారు.ప్రదర్శన తిలకించినటువంటి గ్రామస్తులు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలలో ఇంత అద్భుతమైనటువంటి పర్ఫామెన్స్ చూపించడాన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజ్యం, ఏ సిడిపిఓ సుచరిత ,సూపర్వైజర్ శంకరమ్మ, సర్పంచ్ బూరల నందయ్య, వార్డు మెంబర్లు, ఇతర సిబ్బంది అంగన్వాడీ టీచర్లు వరలక్ష్మి వనజ ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లు కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు…







