సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తర్వాత మహేష్ కొద్దిగా గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ప్రకటించాడు.
మహేష్ హీరోగా పూజా హెగ్డే ( Pooja Hegde ), శ్రీలీల ( Sreeleela ) హీరోయిన్ లుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”SSMB28”.

ఇప్పటికే వీరి కాంబోలో అతడు, ఖలేజా వంటి రెండు డిఫరెంట్ మూవీస్ వచ్చాయి.ఇక ఇప్పుడు మూడవ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
ఈ సినిమా సంక్రాంతి తర్వాత షూట్ స్టార్ట్ చేసుకుని గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపు తున్నారు.ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చారు.

ఇక మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నాడు.త్వరలోనే ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి మహేష్ బాబు రోల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ కు ఒక క్రేజీ డిసీజ్ ఉంటుందట.
ఈ డిసీజ్ ఇంటర్వెల్ లో రివీల్ అవుతుంది అని ఈ డిసీజ్ కథను పూర్తిగా మలుపు తిప్పుతుంది అని సెకండాఫ్ మొత్తం ఈ డిసీజ్ చుట్టూనే తిరుగుతుంది అని తెలుస్తుంది.

మొత్తానికి ఈసారి త్రివిక్రమ్ ఈ కథ కోసం చాలా కసరత్తులు చేసినట్టు అనిపిస్తుంది.ఏది ఏమైనా ఇలాంటి డిసీజ్ లను సూపర్ స్టార్ మహేష్ లాంటి వారు అంగీకరించడం దానిని చేయడం గ్రేట్ అనే చెప్పాలి.ఇదిలా ఉండగా ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.
థమన్ సంగీతం అందిస్తున్నారు.కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.







