సీఏపీఎఫ్ కానిస్టేబుళ్ల ఎంపిక పరీక్షలపై కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
2024 జనవరి నుంచి ప్రాంతీయ భాషల్లోనూ సీఏపీఎఫ్ పరీక్షలను నిర్వహించనున్నారు.సీఏపీఎఫ్ ఎంపిక పరీక్షలను తెలుగులో కూడా నిర్వహించాలని ఇటీవలే మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.







