“BRS” పార్టీపై పరోక్షంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..!!

ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్రం వెనకడుగు వేయటం తెలిసిందే.ఈ పరిణామంపై BRS పార్టీకి చెందిన కేటీఆర్, హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

 Sensational Comments Of Former Minister Vellampalli Srinivas Indirectly On Brs-TeluguStop.com

తమ వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది అని చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు.చేసింది ఏమీ లేదని కామెంట్లు చేయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మా నినాదం.ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడీ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేని పార్టీ విశాఖ ఉక్కు పై రాజకీయం చేస్తోంది అంటూ పరోక్షంగా BRS పార్టీపై వెల్లంపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రైవేటీకరణ పై కేంద్రం రోజుకో ప్రకటన చేస్తుంది అంటూ మండిపడ్డారు.

అయితే ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకంగా పోరాడుతుందని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube