వీధిన పడ్డ నిరుపేద కుటుంబాలు ఆదుకోవాలని వేడుకోలు.మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బాబాజీ కాలనీలో షార్ట్ సర్క్యూట్ తో గురువారం రెండు ఇల్లు దగ్ధమయ్యాయి.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.
మండల కేంద్రంలోని బాబాజీ కాలనీకి చెందిన మేకల బిక్షపతి ,మేకల మురళి లు ఇళ్లకు తాళం వేసి కూలి పనికి వెళ్లారు.ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి పక్క పక్కనే ఉన్న రెండిళ్ళు పూర్తిగా దగ్ధమయ్యాయి.
స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వేశారు.అప్పటికే ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
నిరుపేద కుటుంబాలకు చెందిన బాధితుల రెండిండ్లు పూర్తిగా దగ్ధం అవడంతో రెండు కుటుంబాలు వీధిన పడ్డాయి.బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ అనిత,గ్రామస్తులు కోరారు.