పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు.మొత్తం మూడు బిల్లులను ఆమె ఆమోదించారు.
రెండు బిల్లులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదానికి గవర్నర్ తమిళిసై పంపించారు.మరో రెండు బిల్లులను పెండింగ్ లో పెట్టిన తమిళిసై రెండు బిల్లులను ప్రభుత్వానికి తిరిగి పంపారు.
అయితే పెండింగ్ బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదించడం లేదని రాజ్ భవన్ కు, ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే.ఇదే విషయంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
ఈ నేపథ్యంలో విచారణకు ముందే గవర్నర్ తమిళిసై బిల్లులపై కీలక నిర్ణయం తీసుకున్నారు.







