ప్రజల కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.కాంగ్రెస్ పార్టీ కోసమో… ఎన్నికల కోసమో చేస్తున్న పాదయాత్ర కాదని తెలిపారు.
ప్రజా సమస్యలను, బాధలను తెలియజేసేందుకే పాదయాత్ర చేస్తున్నానని భట్టి తెలిపారు.తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబమే దోచుకుంటుందన్నారు.
చెన్నూరుకు సాగునీరు అందకపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.సింగరేణిలో కొత్త ఉద్యోగాలు సృష్టించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలే ఇసుక మాఫియాను నడుపుతున్నారని మండిపడ్డారు.బాల్క సుమన్ నిజమైన విద్యార్థి నాయకుడు అయితే పేపర్ లీక్ పై మాట్లాడాలని తెలిపారు.
బాల్క సుమన్ ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారో చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు.







