విజయవాడలో మరోసారి ఎండీఎంఏ డ్రగ్స్ కలకలం చెలరేగింది.ఆర్టీసీ డ్రైవర్ వద్దనున్న స్కూల్ బ్యాగులో నుంచి కిలో ఎండీఎంఏ డ్రగ్స్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే, ఆర్టీసీ డ్రైవర్ కు అనంతపురంలో గుర్తు తెలియని వ్యక్తి స్కూల్ బ్యాగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ మేరకు విజయవాడలో బ్యాగ్ అందజేయాలని చెప్పాడని ఆర్టీసీ డ్రైవర్ చెబుతున్నాడు.
ఈ క్రమంలో ఆర్టీసీ డ్రైవర్ ను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు ఇందులో భాగంగా అనంతపురం బస్టాండ్ లో సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు.