అవును, ఆమె పేరు దీపాలీ.ఆమె తాజాగా రతన్టాటా కంటే ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసి అందరూ తన గురించి మాట్లాడేలా చేసింది.
ఆమె గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే.వెల్స్పన్ ఇండియా సీఈవో సోషల్ మీడియా స్టార్ దిపాలి గోయెంకా( Dipali Goenka ) గురించి మీరు విన్నారా? పెద్దగా విని వుండరు.కానీ ఆమె సోషల్ మీడియాలో ఒక సెలిబ్రిటీ.తాజాగా ఆమె ఎన్డీటీవీ స్వత్రంత్ర డైరెక్టర్గా కూడా నియమితులయ్యారు.సెబీ మాజీ ఛైర్మన్ యూకే సిన్హాతో పాటు మార్చి 27, 2023 నుండి 2 సంవత్సరాల పాటు ఆ పదవిలో ఆమె కొనసాగుతారు.
ఈ ఘటనతో ఆమె ఫోర్బ్స్ ఆసియా అండ్ ఇండియాలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తింపు పొందింది.దాంతో దిపాలి గోయెంకా ఎవరు అనే విషయం అంతటా ఆసక్తికరంగా మారింది.ప్రపంచంలోని అతిపెద్ద గృహ వస్త్ర కంపెనీ అయినటువంటి ‘వెల్స్పన్ ఇండియా లిమిటెడ్’( Welspun India Limited ) సీఎండీనే దిపాలి గోయెంకా.దిపాలి గోయెంకా భర్తనే బీకే గోయెంకా( BK Goenka ) వెల్స్పన్ గ్రూప్ చైర్మన్.18 సంవత్సరాల వయస్సులోనే బీకే గోయెంకాను దిపాలి వివాహం చేసుకున్నారు.ఇకపోతే బీకే గోయెంకా ఇటీవల ముంబైలో రూ.240 కోట్లతో ఒక లగ్జరీ ఫ్లాట్ను కొనుగోలు చేయగా అది కాస్త ఇపుడు టాక్ అఫ్ ది టౌన్ అవుతోంది.
విషయం ఏమంటే రతన్ టాటా( Ratan Tata ) ఇంటి విలువ రూ.150 కోట్లు. అందుకారణంగా ఆ ఇంటి విలువ రతన్ టాటా ఇంటి కంటే ఖరీదైన ఇల్లుగా ఇపుడు రికార్డుల్లో నిలిచింది.దిపాలి గోయెంకా సోషల్ మీడియా స్టార్ అని చాలామందికి తెలిసే ఉంటుంది.
ట్విటర్, ఇన్స్టాలో ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు.ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 191కే ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె స్టార్ రేంజ్ను అర్థం చేసుకోవచ్చు.వెల్స్పన్ గ్రూప్లో 25వేల ఉద్యోగులతో 2.3 బిలియన్ల డాలర్ల ఆదాయంతో టాప్ టెక్స్టైల్ కంపెనీగా దూసుకుపోతోంది.ఇన్నోవేషన్, బ్రాండ్స్ అండ్ సస్టైనబిలిటీపై దృష్టి సారించి వెల్స్పన్ హోమ్ టెక్స్టైల్ వ్యాపారాన్ని బిలియన్ డాలర్లతో ప్రపంచస్థాయికి చేర్చడంలో ఆమెది కీలక పాత్ర.