కుక్కల దాడిలో ఐదు గొర్రెపొట్టేళ్లు మృతి,మరో ఐదు పొట్టేళ్ళకు తీవ్రగాయాలు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: వీధి కుక్కల దాడిలో ఐదు గొర్రె పొట్టేలు మృతి చెందిన ఘటన మోత్కూర్ మండల పరిధిలోని దాచారం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం మండల పరిధిలోని దాచారం గ్రామానికి చెందిన జాల అశోక్,అండెం పిచ్చిరెడ్డి సాయంత్రం వరకు గొర్లను మేపుకొచ్చి దొడ్లో తోలారు.

 Five Lambs Killed In Dog Attack, Five More Seriously Injured , Five Lambs, Seri-TeluguStop.com

అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో గోడ దూకి వచ్చిన కుక్కల మంద గొర్ల మందపై విరుచుకు పడిండి.గొర్ల కాపర్లు వెళ్లి చూసేసరికి కుక్కల మంద దాడి చేస్తుంది.

అప్పటికే ఐదు గొర్రెలు మృతి చెందగా మరో ఐదు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.దాడికి పాల్పడిన కుక్కలను తరిమే ప్రయత్నంలో ఒక కుక్కను చంపగా,మిగిలిన కుక్కల మంద అక్కడ నుండి తప్పించుకుంది.

కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతుండడంతో గొర్ల పెంపకందారులు,వృద్ధులు, చిన్నపిల్లలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయబ్రాంతులకు గురవుతున్నారు.తక్షణమే కుక్కల నివారణకు చర్యలు తీసుకొని, బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube