ఉక్రెయిన్ నుంచి వచ్చిన మెడికోలకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఈ మేరకు దేశంలో ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు రాసేందుకు మెడికోలకు అనుమతి ఇచ్చిందని తెలుస్తోంది.
ఏడాదిలో ప్రాక్టికల్ తో పాటు థియరీ పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది.సుప్రీంకోర్టులో దీనిపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా మెడిసిన్ చదువు మధ్యలోనే ఆగిపోతుందనే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తాజా ప్రకటనతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.