హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల బయలుదేరారు.
ఈ క్రమంలో గేట్ వద్దనే షర్మిల వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసులతో షర్మిల వాగ్వివాదానికి దిగడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.







