బెంగళూరులో పేలుడు కలకలం సృష్టించింది.గ్యాస్ పైప్ లైన్ లీకేజీతో బ్లాస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.
హెచ్ఎస్ఆర్ సెక్టార్ లోని ఓ ఇంటిలో గ్యాస్ పైప్ లైన్ ఒక్కసారిగా పేలింది.బ్లాస్టింగ్ ధాటికి రెండు ఇళ్లు ధ్వంసం అయ్యాయి.
భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం పైప్ లైన్ లీకేజీని ఆపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.







