ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయని బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు తెలిపారు.రాష్ట్రంలో రెండు కుటుంబ పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారని వెల్లడించారు.
రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని రావెల కిశోర్ బాబు విమర్శించారు.ఏపీకి పెట్టుబడి దారులు రావడం లేదని చెప్పారు.
మరోవైపు కేసీఆర్ పై బీజేపీ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.ఈ క్రమంలోనే కవితపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
కేంద్రం దర్యాప్తు సంస్థలను సైతం దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు.