తెలంగాణలో ఫ్లెక్సీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.బీజేపీ టార్గెట్గా హైదరాబాద్లో హోర్డింగ్లు వెలిశాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాకకు వ్యతిరేకంగా వాషింగ్ పౌడర్ పేరుతో హోర్డింగులు దర్శనమిస్తున్నాయి.హిమంత, నారాయణ రాణె, సువేందు అధికారి సుజనా చౌదరి, సింధియా సహా పలువురు నేతల పేర్లతో ఫ్లెక్సీలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.
బీజేపీలో చేరితే మరకలు పోతాయని అర్థం వచ్చేలా హోర్డింగ్స్ ను ఏర్పాటు చేశారు.







