ఈసారి ఎలాగైనా తెలంగాణ గడ్డపై జెండా పాతాల్సిందేనని బిజెపి పట్టుదలతో ఉంది .అందుకోసం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తుంది .
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో నివాసంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ ఆద్వర్యం లో పార్టీ అత్యవసర కోర్ సమావేశం నిన్న మంగళవారం జరిగినది .ఇందులో పాల్గొన్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఈ మేరకు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసినట్టుగా సమాచారం .రెండు పర్యాయాలు అదికారం కారం లో ఉన్న బా ర స పార్టీ మీద వ్యతిరేకత తీవ్ర స్తాయిలో ఉన్నదని దానిని పూర్తి గా బిజెపి కి అనుకూలం గా మార్చుకోవాలని , ప్రతి పది రోజులకు ఒకసారి కోర్ కమిటీ సమావేశం అయ్యి పార్టీ ని ముందుకు తీసుకు పోయే అంశాల గూర్చి చర్చించాలని పార్టీ లో కి వలసలను ప్రోత్సహించాలని ,, విద్యార్దులను జిల్లాస్థాయి నాయకులను పార్టీ లోకి చేరే విదo గా కార్యక్రమాలు చేయాలని వారికి పార్టీ సిద్దాంతల పట్ల అవగణ కలిపించాలని సూచించారు

సమస్యలను గుర్తించండి : తెలంగాణ ప్రబుత్వం విపలమైన అంశాలను గుర్తించి వాటికి ప్రజాలలో ప్రచారం కల్పించాలని ,పోడు భూముల పట్టాలు ,ఋణమాపి అమలు కాకపోవడం ,కేజి టూ పీజీ ఇలా సమస్యల పై ఒక లిస్ట్ తయారు చేసుకుని సరైన ప్రణాళికా ప్రకారం ఉద్యమాలు చేయాలని పార్టీ బలోపేతమే లక్ష్యం గా సాగిన స్ట్రీట్ కార్నర్ వంటి సమావేశాలు విజయవంతం అయ్యాయని బండి సంజయ్ తో పాటి మిగిలిన రాష్ట్ర నాయకులను ఒక పక్క అబినoదిస్తూనే, విజయానికి మరింత కష్ట పడాలని దిశా నిర్దేశం చేశారు

బేదాభిప్రాయలు ప్రక్కన పెట్టండి నేతల మద్య ఉన్న అభిప్రాయ బేదాలు కారణం గా ఆశించిన మేర పార్టీ లో చెరికలు లేవని బలమైన కొంత మంది నేతలు పార్టీ లో కి చేరడానికి ఆసక్తి తో ఉన్న వారిని గుర్తించి పార్టీ లోకి తీసుకు రావడం లో రాష్ట్ర నాయకత్వం వెనకపడినట్టు గా కు అమిత షా సున్నితం గా మందలించినట్టు విశ్వసనీయ సమాచారం .ఇకపై అటువంటి తప్పులు పునరావృతం చేయవద్దని , తెలంగాణ మరియు కర్ణాటక మీద తానూ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు యందు వల్ల రానున్న కాలం లో మరిన్ని సమావేశాలకు తాను హాజరవుతానని , అందరం కలసి పార్టీని అదికారం లోకి తీసుకు రావడం లో కృషి చేయాలని తెలిపినట్టు సమాచారం .







