కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలో అధిష్టానం నిర్ణయిస్తుంది.చాలామంది సన్నిహితులు.
శ్రేయోభిలాషులు, ప్రజలు గుడివాడ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు.కానీ పోటీకి సంబంధించి పార్టీ అధిష్టానం నిర్ణయమే తన నిర్ణయం అని రేణుక చౌదరి క్లారిటీ ఇచ్చారు.
విజయవాడ పార్లమెంటు నుంచి అయినా అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తానని తెలిపారు.

ఇక ఇదే సమయంలో అమరావతి రైతుల ఉద్యమంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నో రోజుల నుండి అమరావతి రైతులు క్రమశిక్షణగా ఉద్యమాలు చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఏ క్షణంలో అయినా అమరావతి రైతులు పిలిస్తే తాను కూడా వస్తానని మాట ఇచ్చారు.
రోజుకో స్కీమ్ అంటూ బంగారం లాంటి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.







