తాజాగా ఇండియాకి వచ్చిన ఎన్నారైకి అతని లవర్ పెద్ద షాక్ ఇచ్చింది.అతడిని కిడ్నాప్ చేసి భారీగా డబ్బులు దోచేసింది.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆ ఎన్నారై పేరు మొహియుద్దీన్ అబ్దుల్ ఖాదర్. ఈ ఎన్నారైని తన ప్రియురాలు, ఆమె సోదరుడు, కొంతమంది వ్యక్తులు తిరువనంతపురం విమానాశ్రయానికి రాగానే కిడ్నాప్ చేశారు.
ఫిబ్రవరి 22న కిడ్నాప్ జరగగా, అతడిని విడిపించేందుకు కిడ్నాపర్లు కోటి రూపాయలు డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే.అబ్దుల్ ఖాదర్ దుబాయ్ నుంచి తిరువనంతపురం చేరుకున్నప్పుడు అతని లవర్ ఇన్షా, ఆమె సోదరుడు షఫీక్ అతన్ని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నారు.తరువాత అబ్దుల్ తన తల్లిదండ్రులను కలవకుండా తిరువనంతపురం సమీపంలోని వర్కాలలోని రిసార్ట్కు తీసుకెళ్లారు.
అక్కడ, వారు రూ.కోటి డిమాండ్ చేస్తూ ఎన్నారైని చిత్రహింసలు పెట్టారు.అలా కిడ్నాపర్లు అబ్దుల్ ఖాదర్ నుంచి రూ.15 లక్షల, 70 వేల క్యాష్, బంగారు ఆభరణాలు, రెండు ఖరీదైన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.తరువాత అతన్ని విమానాశ్రయం ఆవరణలో దింపారు.తిరువనంతపురం పోలీసులు అతన్ని రక్షించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఇన్షా, అబ్దుల్ ఖాదర్ దుబాయ్లో ఏడాది కాలంగా ప్రేమాయణం సాగించి విడిపోయారు.తరువాత ఇన్షా అతని నుంచి కోటి రూపాయలను నష్టపరిహారంగా వసూలు చేయడానికి పన్నాగం పన్నింది.అదే పథకాన్ని కరెక్ట్గా అమలు చేసింది.మాజీ లవర్ వలలో పడిన అబ్దుల్ ఖాదర్ చిత్రహింసలు భరించలేక కిడ్నాపర్ల ఖాతాలోకి ఆన్లైన్ పద్ధతిలో డబ్బును ట్రాన్స్ఫర్ చేశాడు.నగలు, ఫోన్లను కూడా ఇచ్చాడు.
కాగా అతడిని విమానాశ్రమంలో వదిలేసిన తర్వాత కేరళ పోలీసులు రక్షించి అసలు విషయం తెలుసుకున్నారు.ఆపై అబ్దుల్ ఖాదర్ను కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన వాహన డ్రైవర్, లవర్ ఇన్షా, ఆమె సోదరుడు, మరో ఆరుగురితో సహా కిడ్నాపర్లందరినీ అరెస్టు చేశారు.







