రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఎంతో బిజీగా ఉన్నారు.హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ప్రజెంటర్గా పాల్గొనేందుకు ఆహ్వానం రావడంతో ఆయన అమెరికాలో సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే లాస్ ఏంజిల్స్కు వెళ్లాడు.అక్కడి పాపులర్ మీడియా ఏబీసీ, గుడ్ మార్నింగ్ అమెరికా వంటి షోలో పాల్గొన్నాడు.
ఇలా ఈ షోలలో పాల్గొన్న తొలి ఇండియన్ హీరోగా రామ్ చరణ్ రికార్డులు క్రియేట్ చేశాడు.ఇలా చరణ్ దక్కిన గౌరవం పై ఒక్క టాలీ వుడ్ హీరో కూడా ఇప్పటివరకు స్పందించలేదు.

ఇక రామ్ చరణ్ కి దక్కిన ఈ గౌరవం పై టాలీవుడ్ హీరోలు ఏమాత్రం స్పందించకపోవడంతో ఈయనకు దక్కిన గౌరవం పట్ల హీరోలకు జలసీగా మారిందా? అందుకే టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు రామ్ చరణ్ విషయంలో మౌనం వహిస్తున్నారా అనే సందేహాలు వక్త్యం అవుతున్నాయి.విచిత్రంగా మన తెలుగు హీరోల్లోంచి ఏ ఒక్కర కూడా రామ్ చరణ్కు కంగ్రాట్స్ ట్వీట్ వేయడం లేదు.అయితే రామ్ చరణ్ కి దక్కిన ఈ గౌరవం పై మెగా హీరోలు ఒక్కొక్కరు స్పందిస్తూ రిప్లై ఇస్తున్నారు.

ఇక చరణ్ కు దక్కిన ఈ గౌరవం గురించి కనీసం అల్లు ఫ్యామిలీ నుంచి కానీ, మహేష్ బాబు ప్రభాస్ వంటి వారు కూడా స్పందించకపోవడం గమనార్హం.బెస్ట్ యాక్టర్స్ లిస్ట్లో బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ వంటి వారి పేర్ల సరసనా రామ్ చరణ్ ఎన్టీఆర్ పేర్లు కూడా నామినేషన్లో కనిపించాయి.ఇలా ఒక తెలుగు హీరోల పేర్లు అంతర్జాతీయ వేదికపై కనిపించడంతో ఇది తెలుగువారు ఇండియన్ సినీ సెలబ్రిటీలు ఎంతో గర్వించాల్సిన విషయం అయితే ఈ విషయంపై ఒకరు కూడా స్పందించకపోవడంతో ఈ హీరోలకు దక్కిన గౌరవం చూసి ఇతర సెలబ్రిటీలు చాలా ఈర్ష్య పడుతున్నారని చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.







