టీడీపీ నేతల తీరుపై ఏపీ మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ తమ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే కొడతారని తెలిపారు.
అధికారం కోసం రోడ్లపై బూతులు తిడుతున్నారని మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు.పోలీసులపై దాడులు చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.
తండ్రీకొడుకు ఇద్దరూ త్వరలోనే మెంటల్ ఆస్పత్రికి వెళ్లక తప్పదని చెప్పారు.రాష్ట్రంలో బుల్డోజర్లు పెట్టినా టీడీపీ పైకి లేవదన్నారు.
టీడీపీకి ఇక రాజకీయ సమాధి తప్పదని స్పష్టం చేశారు.







