ప్రపంచ శాస్త్రవేత్తలు ఎల్లవేళలా జనులకు ఉపయోగ పడే విధంగా వారి పరిశోధనలు కొనసాగిస్తూ వుంటారు.ఈ క్రమంలోనే తాజాగా అమెరికాకు చెందిన సాండియా నేషనల్ లాబొరేటరీస్ శాస్త్రవేత్తలు ఓ విషయంలో ముందడుగు వేశారు.
కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా కొత్త 3డీ ప్రింటెడ్ లోహ మిశ్రమాన్ని వీరు తయారు చేయడం జరిగింది.దీన్ని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో వినియోగించడం ద్వారా తక్కువ కర్బన ఉద్గారాలు వెలువడుతాయని, ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కాగా ఈ కొత్త లోహ మిశ్రమం అనేది 25 శాతం టైటానియం, 13 శాతం నియోబియం, 42 శాతం అల్యూమినియం, 8 శాతం జిర్కోనియం, 4 శాతం టాంటలమ్, 8 శాతం మాలిబ్డినంతో తయారు చేసారు.కాగా ఈ లోహ మిశ్రమం 800 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా బలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.మీరు చదివే వుంటారు.ఎలెక్ట్రిక్ రెసిస్టివిటీ యొక్క రెసిప్రొకల్గా, అధిక విద్యుత్ వాహకత కలిగిన లోహాలు విద్యుత్ ప్రవాహాన్ని తక్కువ ప్రతిఘటనతో కదిలేలా చేస్తాయి.అందుకే ఇవి ఎక్కువ కరెంటుని విడుదల చేయగలవు.

ఇది గాని పూర్తిగా వాడకంలోకి వస్తే ఎలక్ట్రిక్ కండక్టర్ల లేదా ఇతర పరిశ్రమల తయారీదారులకు ఇది గొప్పగా ఉపయోగపడుతుంది.ఇక ఉష్ణాన్ని మూడు మార్గాలు… అనగా ప్రసరణ, ఉష్ణప్రసరణ మరియు రేడియేషన్ ద్వారా ఉత్పత్తి చేస్తారు.ఇంకా కేవలం బొగ్గు ద్వారా విద్యుత్తుని తయారు చేసే దేశాలు ఈ ప్రక్రియను వాడుకొని భవిష్యత్తులో ముందుకి పోగలవు.
అందుకే పలు ఫారిన్ ప్రభుత్వాలు ఇప్పటికీ సాండియా నేషనల్ లాబొరేటరీస్ శాస్త్రవేత్తలతో మంతనాలు జరిపినట్టు భోగట్టా.







