విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం ఒక విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది.అల్లూరు జిల్లాకు చెందిన దంపతుల విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి రాగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.
దీంతో మృతి చెందిన ఆ బిడ్డను సొంతూరు పాడేరు తీసుకెళ్లడానికి అంబులెన్స్ కోసం వారు అంబులెన్స్ అడిగారు.కానీ ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వడానికి నిరాకరించటంతో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకు తమ సొంత స్కూటీపై ఆ మృతదేహాన్ని తల్లిదండ్రులు తరలించాల్సి వచ్చింది.
ఈ తతంగం మొత్తం వీడియో రూపంలో సోషల్ మీడియాలో వెలుగులోకీ వచ్చింది.ఈ ఘటన పై రాజకీయ నాయకులతో పాటు సామాన్య జనులు మండిపడుతున్నారు.

ఇక ఇదే ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియాలో మండిపడ్డారు.” రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో మీకంటే బెటర్ పబ్జీ ప్లేయర్ గారూ! పసిగుడ్డు మృతదేహాన్ని విశాఖ నుంచి 120 కిలోమీటర్లు బైకుపై పాడేరు తీసుకెళ్లిన ఆ తల్లిదండ్రుల కష్టం విన్న మాకే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.మీకు గుండె మాత్రం కరగదు.రోజుకో అమానవీయ ఘటన, పూటకో దయనీయ దృశ్యం మీ దరిద్రపాలనలో సర్వసాధారణమైపోయాయి.వైద్యానికి వెళితే నిర్లక్ష్యం.చనిపోయిన వారిని తరలించేందుకు అంబులెన్సులు రావు.
నిరుపేదలు చనిపోతే అనాథ శవాల్లా పడి వుండడమేనా?” అనీ ట్విట్టర్ లో లోకేష్ మండిపడ్డారు.







