రైటర్ గా ఉన్న అనిల్ రావిపూడి డైరెక్టర్ గా మారి సినిమా చేయాలి అనుకున్నప్పుడు పటాస్ లాంటి ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ పట్టుకొని హీరోల దగ్గరికి కథ చెప్పడానికి తిరగేవాడట అప్పుడు మొదటగా ఈ కథ ను మాస్ మహారాజా రవితేజ కి వినిపించాడట అయితే రవితేజకి అప్పటికే వక్కంతం వంశీ వచ్చి టెంపర్ కథ చెప్పాడట దాంతో ఈ రెండు స్టోరీ లు కొంచం సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి నేను ఇది చేయలేను

అని చెప్పాడట దాంతో అనిల్ రావిపూడి ఈ స్టోరీని మంచు విష్ణు తో చేద్దాం అనుకొని ఆయనకి స్టోరీ చెప్పాడట ఆయనకు ఈ స్టోరీ నచ్చినప్పటికి తను ఈ స్టోరీ లో ఏవో మార్పులు చెప్పాడట వాటిని మార్చడం ఇష్టం లేని అనిల్ అక్కడి నుంచి బయటికి వచ్చేశాడట.

ఇక ఆ తర్వాత రానా దగ్గుబాటి దగ్గరికి వెళ్లి ఈ కథ చెబితే ఆయన అప్పటికే బాహుబలి సినిమా బిజీలో ఉండటం వల్ల ఆయన కొద్దిరోజులు వెయిట్ చేయమని చెప్పాడట అప్పటికే ఈ స్టోరీ రాసుకొని 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్న ఏది వర్కౌట్ కాలేదు ఇంకా ఆగడం అంటే నావల్ల కాదు అని అనిల్ చెప్పేసి చివరగా కళ్యాణ్ రామ్ కి కథ వినిపించాడట కళ్యాణ్ రామ్ కి కథ బాగా నచ్చి సినిమా చేద్దాం అని చెప్పి సినిమాని స్టార్ట్ చేశారు ఈ సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి కళ్యాణ్ రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.చాలా సంవత్సరాల తర్వాత కళ్యాణ్ రామ్ కి ఈ సినిమాతో ఒక మంచి హిట్ పడిందనే చెప్పాలి.ఆ హిట్ తో కళ్యాణ్ రామ్ మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తన కంటు ఒక మంచి ఇమేజ్ తో ముందుకు దూసుకెళ్తున్నాడు.
రీసెంట్ గా బింబిసార సినిమాతో మంచి హిట్ కొట్టాడు.








