తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు సెజ్ లో పేలుడు సంభవించింది.గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో భారీ బ్లాస్ట్ జరిగింది.
పేలుడు ధాటికి 35 అడుగుల మేర రాళ్లు, మట్టి పైకి లేచాయి.సుమారు ఐదు అడుగుల లోతున గోయ్యి ఏర్పడింది.
ఒక్కసారిగా గ్యాస్ పైప్ లైన్ పేలుడు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.కాగా, ఇంటింటికి కనెక్షన్ లో భాగంగా గ్యాస్ పైప్ లైన్ లో బ్లాస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.







