సినిమా ఇండస్ట్రీ లో హీరో అయిన డైరెక్టర్ అయిన సినిమా చేయాలి అంటే స్టోరీ కావాలి అది లేకపోతే హీరో డేట్స్ ఇవ్వడు డైరెక్టర్ సినిమా చేయడు.రైటర్ లేకపోతే సినిమా లేదు కానీ సినిమా ఇండస్ట్రీ లో కథలు రాసే రైటర్స్ కి సరైన వాల్యూ ఇవ్వరు అందుకే చాలా మంది రైటర్స్ డైరెక్టర్లు అవుతున్నారు… ఇప్పటికే తెలుగు లో చాలా మంది రైటర్స్ డైరెక్టర్స్ అయ్యారు.వాళ్లలో త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి లాంటి వాళ్ళని ప్రథమంగా చెప్పుకోవచ్చు…

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఇండియాలోనే టాప్ రైటర్ గా పేరు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ బాహుబలి సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు అమీర్ ఖాన్ కి బజరంగీ బాయిజన్ కథ చెప్పాడట ఆ కథ ఆయనకి నచ్చలేదు దాంతో మరొక రోజు ఇదే కథ సల్మాన్ ఖాన్ కి వినిపించాడట ఆ స్టోరీ సల్మాన్ కి విపరీతం గా నచ్చడం తో ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ కి కూడా ఆ కథ వినమని సల్మాన్ చెప్పాడట అప్పుడు ఆ ప్రొడ్యూసర్ కి కూడా విజయేంద్ర ప్రసాద్ ఈ కథ చెప్పాడు అది విన్న ప్రొడ్యూసర్ మీకు రెమ్యూనరేషన్ గా 20 లక్షలు ఇస్తాను స్టోరీ ఇచ్చేసేయండి మనం ఈ సినిమా చేద్దాం అని చెప్పాడట.దాంతో విజయేంద్ర ప్రసాద్ తనలో తానే నవ్వుకొని ఈ సినిమా 500 కోట్ల దాకా కలెక్షన్స్ వసూలు చేస్తుంది ఇంతమంచి కథని 20 లక్షలకు ఇవ్వాలా అని అన్నాడట దాంతో వాళ్ళు ఇంకో 20 ఇస్తాము ఇవ్వండి అని అన్నారట అప్పుడు విజయేంద్ర ప్రసాద్ కి చాలా కోపం వచ్చిందట.దాంతో నాకు 2 కోట్లు ఇస్తేనే ఈ కథ ఇస్తాను దానికి ఒక్క రూపాయి తక్కువైన ఇవ్వను అని చెప్పాడట దాంతో ఆ ప్రొడ్యూసర్ అంత మనీ ఇవ్వలేము అని చెప్పాడట సరే అని విజయేంద్ర ప్రసాద్ అక్కడి నుండి వచ్చేసాడట…

అప్పడు విజయేంద్ర ప్రసాద్ మనసులో ఇలా అనుకున్నాడట ఒకవేళ బాలీవుడ్ రైటర్స్ కనక ఈ కథ చెబితే వాళ్ళకి అయితే 2 కోట్లు ఈజీగా ఇచ్చేవారు మనకు అయితే ఇంత తక్కువ ఇస్తాం అంటున్నారు మన వాళ్లు అంటే వాళ్ళకి ఇంత చులకన భావం ఎందుకు అని అనుకున్నాడట…అయితే డబ్బుల విషయంలో విజయేంద్ర ప్రసాద్ ఈ స్టోరీ ఇవ్వనన్నాడు అని తెలుసుకున్న సల్మాన్ ఖాన్ వేరే ప్రొడ్యూసర్స్ తో తను అడిగిన 2 కోట్ల డబ్బులు ఇప్పించి ఈ సినిమా తీశాడు ఈ సినిమా అప్పటి వరకు బాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి 500 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది…అలా బాలీవుడ్ వాళ్ళు ఒకప్పుడు మనల్ని చాలా చులకనగా చూసేవారు…

రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఇద్దరు కలిసి బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్టామినా ఏంటో బాలీవుడ్ కి చూపించారు…ఇప్పుడు మన వాళ్లతో సినిమా చేయడానికి చూస్తున్నారు కానీ ఇప్పుడు మనవాళ్ళు వాళ్ళని పట్టించుకోవడం లేదు…
.







