కార్పొరేటర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.తాము జోక్యం చేసుకోమని చెప్పారు.
ఎవరికీ ఏం సమస్యలు ఉన్నా తనకు నేరుగా కాల్ చేయాలని సూచించారు.
వారం రోజుల్లో డివిజన్లలో సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీ ఆదాల తెలిపారు.
సీఎంతో మాట్లాడి అవసరమైన నిధులు తీసుకువస్తామని పేర్కొన్నారు.తమతో నడిచే వారికి అండగా ఉంటామని చెప్పారు.
తమతో రాని డివిజన్లలో ఇంఛార్జ్ లను నియమిస్తామని వెల్లడించారు.