శ్రీకాకుళం జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది.అదుపుతప్పిన ఓ లారీ ఉపాధి హామీ కూలీలపైకి దూసుకెళ్లింది.
ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృత్యువాతపడ్డారు.మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఆముదాలవలస మండలం మందడిలో ఈ ఘటన చోటుచేసుకుంది.







