సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత సెలబ్రిటీలు సైతం ఏ చిన్న తప్పు చేసినా విమర్శల పాలవుతున్నారు.లవ్ టుడే సినిమాతో ఓవర్ నైట్ లో నటుడిగా, దర్శకుడిగా ప్రదీప్ రంగనాథన్ కు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు.
అయితే ప్రదీప్ రంగనాథన్ రజనీకాంత్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.ఈ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావించారు.
ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమా జాయింట్ జగదీశన్ అని కొంతమంది కామెంట్లు చేశారు.అయితే అందులో రజనీకాంత్ ఫ్యాన్స్ పిచ్చివాళ్లు అనే కామెంట్ ఉండగా ఆ కామెంట్ ఉన్న పోస్ట్ కు ప్రదీప్ రంగనాథన్ లైక్ కొట్టడం గమనార్హం.
ప్రదీప్ రంగనాథన్ తెలిసి లైక్ చేశారో తెలియక లైక్ చేశారో తెలీదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఆయనపై మండిపడుతున్నారు.ప్రదీప్ రంగనాథన్ ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
ప్రదీప్ సారీ చెబితే మంచిదని అలా చేస్తే మాత్రమే ఈ సమస్య నుంచి బయటపడతాడని కొంతమంది చెబుతున్నారు.ప్రదీప్ మాత్రం ఈ వివాదం గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు.అయితే రజనీకాంత్ మాత్రం ఇలాంటి కామెంట్లను అస్సలు పట్టించుకోరనే సంగతి తెలిసిందే.ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు.
ప్రదీప్ రంగనాథన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంటుంది.లవ్ టుడే సక్సెస్ తర్వాత ఈ డైరెక్టర్ కమ్ హీరోకు అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.లవ్ టుడే సక్సెస్ తో ప్రదీప్ రంగనాథన్ రెమ్యునరేషన్ కూడా ఊహించని రేంజ్ లో పెరిగిందని తెలుస్తోంది.సరైన కథ దొరికితే ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్ లో నటించడానికి కూడా స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.