కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.మాస్టర్ ప్లాన్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో వ్యక్తిగతంగా హాజరైన కేఏ పాల్ వాదనలు వినిపించారు.
రైతులను సంప్రదించకుండానే మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం రూపొందించిందని ఆయన మండిపడ్డారు.
అయితే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసినట్లు కౌన్సిల్ ప్రకటించిందన్నారు.ఈ నేపథ్యంలో కౌన్సిల్ కు నిర్ణయం తీసుకునే అధికారం లేదని తెలిపారు.
మాస్టర్ ప్లాన్ రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.కేఏ పాల్ వాదనలు విన్న న్యాయస్థానం ఫిబ్రవరి 13లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది.