దిగ్గజ పారిశ్రామిక వేత్త అదానీ గ్రూప్ 413 పేజీల సమాధానంపై అమెరికా షార్ట్ సెల్లింగ్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ హిండెన్ బర్గ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
88 ప్రశ్నల్లో 66 ప్రశ్నలకు అదానీ గ్రూప్ సమాధానం ఇవ్వలేదని చెప్పారు.జాతీయ జెండా ముసుగులో భారత్ ను అదానీ గ్రూప్ దోచుకుంటోందని ఆరోపించారు.తమ ప్రశ్నలకు అదానీ గ్రూప్ సమాధానం ఇవ్వలేదన్నారు.వాస్తవిక సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.







