సాధారణంగా పెళ్లి పూర్తయిన తర్వాత వరుడు వధువును కారులో తన ఇంటికి తీసుకెళ్తాడు.ఆ కారు నిండా గులాబీ పువ్వులు అతికిస్తారు.
అలాగే న్యూలీ మ్యారీడ్ అనే బోర్డు పెడతారు.ఏ పెళ్లిలో చూసుకున్నా ఇలాంటి సీనే కనిపిస్తుంది.
కానీ తాజాగా రాజస్థాన్లోని ఎత్వా పట్టణంలో జరిగిన ఒక వివాహ వేడుక ఒక ప్రత్యేకమైన ట్విస్ట్తో ముగిసింది.ఈ వేడుకలో పెళ్లయిన తర్వాత వధూవరులు ఏకంగా ఒక బ్లాక్ హెలికాప్టర్లో బయలుదేరారు.
హెలికాప్టర్లో పెళ్లి చేసుకోవాలనే తన తాతయ్యల కోరికను తీర్చాలనుకున్న వరుడు సునీల్ ఈ ఆలోచన చేశాడు.తన ఇంటికి తన అత్తవారింటికి అంటే రెండు పట్టణాల మధ్య దూరం కేవలం 60 కి.మీ మాత్రమే, కానీ సునీల్ తన తాతలను సంతోషపెట్టాలని నిర్ణయించుకున్నాడు.అతను ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ నుండి హెలికాప్టర్ను అద్దెకు తీసుకున్నాడు.
ఆపై కోటలోని నైనాని ఫామ్ నుంచి తన తాతలు, ఆరేళ్ల మేనల్లుడితో బయలుదేరాడు.
వారు ఇటావాలోని ఆస్తా కాలేజీలో దిగారు, అక్కడ సునీల్ రేఖను వివాహం చేసుకున్నారు.వేడుక ముగిసిన తరువాత, వారు హెలికాప్టర్లో స్వగ్రామానికి తిరిగి వచ్చారు, సునీల్ తాతయ్యలు వెనుక సీటులో ఎంతో సంతోషిస్తూ చిరునవ్వుతో కూర్చున్నారు.సునీల్ వారితో సెల్ఫీ తీసుకున్నారు.
ఇది కుటుంబానికి ప్రత్యేకమైన క్షణం అని వరుడు తెలిపాడు.తమ పెళ్లి ప్రయాణాన్ని కలిసి ప్రారంభించడానికి ఒక ఏకైక మార్గం ఇదే అని అతని మీడియాకు తెలిపాడు.
కాగా హెలికాఫ్టర్ తమ పరిసర ప్రాంతాల్లోకి రావడంతో స్థానికులు అందరూ గుమిగూడారు.చాలామంది ఫొటోలు, వీడియోలు తీశారు.
అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.