ఈరోజు ఉదయం లోకేష్ పాదయాత్రలో నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోవడం కలకలం సృష్టించింది.అయితే ఆయనకి గుండె నొప్పి రావటంతోనే తీవ్రస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలియజేయడం జరిగింది.
దీంతో తారకరత్న ఆరోగ్యం విషమిస్తూ ఉండటంతో ప్రస్తుతం బెంగుళూరు తీసుకెళ్లడానికి తెలుగుదేశం పార్టీ పెద్దలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఈ క్రమంలో నందమూరి తారక రత్న ఆరోగ్యంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
జనసేన పార్టీ తరపున ప్రకటన విడుదల చేశారు.ఆ ప్రకటనలో “నటుడు శ్రీ నందమూరి తారకరత్న కుప్పంలో తీవ్ర స్వస్థతకు లోను కావటం బాధాకరం.
మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తున్నారని సమాచారం అందింది.శ్రీ తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి తన రోజువారి కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ప్రకటన విడుదల చేయడం జరిగింది.