పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియా వేదికగా తన పిల్లలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే ఈమె తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా తన కుమార్తె ఆధ్యాతో కలిసి కాశ్మీర్ కొండల్లో విహరించిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా తరచూ పిల్లలతో కలిసి వెకేషన్ వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి రేణు దేశాయ్ తాజాగా ఢిల్లీ వీధులలో చక్కర్లు కొడుతున్నారు.ఈ క్రమంలోనే రేణు దేశాయ్ ఢిల్లీ వెకేషన్ కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ వీడియోలో రేణు దేశాయ్ పచ్చి బఠానీలు తింటూ ఉండగా ఈ వీడియోని తీసినట్టు తెలుస్తుంది.అయితే ఈ వీడియోని షేర్ చేసిన ఈమె తనకు పచ్చి బఠానీలు అంటే చాలా ఇష్టమని ప్రతి ఏడాది డిసెంబర్ కోసం తాను ఎంతో ఎదురు చూస్తూ ఉంటానని చెప్పుకొచ్చారు.డిసెంబర్ నెలలో పచ్చి బఠానీ పంట చేతికి వస్తుంది.పచ్చి బఠానీలు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయని వాటిని ఎన్ని పెట్టిన తాను తినేస్తానని అయితే అవి అయిపోగానే తను చాలా బాధపడతానంటూ ఈ వీడియో ద్వారా రేణు దేశాయ్ తనకు పచ్చిబఠానీలు అంటే ఎంత ఇష్టమో తెలియజేశారు.
ఇలా రేణు దేశాయ్ పచ్చి బఠానీలు తింటూ ఉండగా ఆధ్య ఈ వీడియో తీశారు.చివరికి ఆధ్య కెమెరామెన్ గా మారిపోయిందని సెటైర్లు వేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక వివాహం చేసుకున్న తర్వాత రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉన్నారు.అయితే పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న ఈమె పిల్లలతో ఒంటరిగా ఉన్నారు.చాలా రోజుల తర్వాత ఈమె రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావ్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.