టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించనున్న ‘యువగళం’ పాదయాత్రకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ మేరకు టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లతో కుప్పం ప్రాంతమంతా పసుపుమయంగా మారిపోయింది.
మరోవైపు బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ సీనియర్ నేతలు పర్యవేక్షిస్తున్నారు.యువగళానికి సంఘీభావంగా కుప్పంలో తెలుగు యువత ర్యాలీ చేపట్టనున్నారు.కాగా రేపు ఉదయం 11.03 గంటలకు లోకేశ్ పాదయాత్రను బాలకృష్ణ ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.