దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.కన్నాట్ ప్రాంతంలోని సన్ సిటీ హోటల్ లో అగ్నికీలలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
హోటల్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగినట్లు తెలుస్తోంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆరు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.మరోవైపు మంటలు భారీగా చెలరేగుతుండటంతో స్థానికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.







