ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ బోర్డు తిప్పేసినట్లు తెలుస్తోంది.గిద్దలూరులో ఉన్న హైస్కూల్ ఒక్కసారిగా మూతపడింది.
దీంతో విద్యార్థులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
యాజమాన్యానికి, లీజుకు తీసుకున్న ఉపాధ్యాయులకు మధ్య వివాదం చెలరేగింది.
ఈ క్రమంలో స్కూల్ నిర్వహించలేమని పాఠశాల యాజమాన్యం చేతులెత్తేసిందని సమాచారం.కాగా ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు 16 మంది ఉన్నారు.
అదేవిధంగా యాజమాన్యం తీరుతో 213 మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఇలా మధ్యలో స్కూల్ మూతపడితే తమ పిల్లల భవిష్యత్ ఏంటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







