సినీ సెలబ్రిటీలకు,క్రికెటర్లకు ఎంతో మంచి అనుబంధం ఉందని విషయం మనకు తెలిసిందే.సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంతోమంది నటీమణులు క్రికెటర్లను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలాబాలీవుడ్ సెలబ్రిటీలతో క్రికెటర్లకు ఎంతో మంచి పరిచయం ఉంది.అయితే బాలీవుడ్ సెలబ్రిటీలతో ఉన్నంత పరిచయాలు సౌత్ సెలెబ్రిటీలతో లేవనే చెప్పాలి.
అయితే తాజాగా టీం ఇండియా క్రికెటర్స్ మొత్తం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలిసి ఆయనతో పాటు ఫోటోలకు ఫోజులిచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒకప్పుడు కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైనటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఈ సినిమా తర్వాత ఈయనకు అభిమానుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది.ఇకపోతే జనవరి 18వ తేదీ న్యూజిలాండ్ తో టీమ్ ఇండియా తొలి వన్డే ఆడబోతుంది.ఈ మ్యాచ్ హైదరాబాద్ లో జరుగునున్న నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు మొత్తం హైదరాబాద్ చేరుకున్నారు.
ఇలా హైదరాబాదులో సందడి చేసిన టీమ్ ఇండియన్ క్రికెటర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలిశారు.
ఇలా ఎన్టీఆర్ తో కలిసి టీం ఇండియా క్రికెటర్స్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా టీమిండియా క్రికెటర్స్ ఎన్టీఆర్ ను కలిసే ఫోటోలు దిగడం అంటే ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో అర్థమవుతుంది.మరి వీరంతా ఏదైనా పార్టీ కోసం ఇలా ఎన్టీఆర్ ను కలిసారా లేకపోతే అనుకోకుండా కలిశారా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.