రేపటి భారత్ -కివీస్ వన్డే మ్యాచ్ కు సర్వం సిద్ధం

భారత్ – కివీస్ మధ్య జరగనున్న వన్డే మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది.హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు నిన్నటితో ఆన్ లైన్ టికెట్ల విక్రయాలు ముగిశాయి.

 Everything Is Ready For The India-kiwis Odi Match Tomorrow-TeluguStop.com

ఈ క్రమంలో 29 వేల టికెట్లను అమ్మినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకోగా రెండు టీం కెప్టెన్లు మీడియాతో మాట్లాడనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ క్రికెట్ సందడి కొనసాగుతోంది.గత సెప్టెంబర్ లో భారత్ , ఆస్ట్రేలియా మధ్య టీ20 అభిమానులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే.

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్, భారత్ క్రికెటర్లు నగరానికి వచ్చారు.రేపు ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది.

మ్యాచ్ కు మరో రోజు మాత్రమే ఉండటంతో ఇరు జట్లూ బిజీబిజీగా గడపనున్నాయి.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేయనుంది.రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube