తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలతో ఊహాగానాలకు తెర పడింది.ఎన్నికల బాధ్యత అధ్యక్షుడిగా బండి సంజయ్ నే ఉండనున్నట్లు సమాచారం.
బండి సంజయ్ పనితీరుపై కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.బండి సంజయ్ మాటలు వెంకయ్య నాయుడు ప్రసంగంలా ఉందంటూ ప్రధాని వ్యాఖ్యనించారు.
ప్రజా సంగ్రామ యాత్రను చూసి ఇతర రాష్ట్రాల నేతలు నేర్చుకోవాలన్నారు.జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కాగానే ముందుగా బండి సంజయ్ కు అవకాశం ఇవ్వాలని నడ్డాకు సూచించారు.
బండి సంజయ్ హిందీలో మాట్లాడబోతుండగా మాతృభాషలోనే మాట్లాడాలని సూచించారు.ఈ క్రమంలోనే ప్రసంగం అనంతరం బండి సంజయ్ పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.







